వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుతో తెంచుకోం: పవార్

By Staff
|
Google Oneindia TeluguNews

Sharad Pawar
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కొద్ది సీట్ల కోసం కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోబోమని ఎన్సీపి నేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ అన్నారు. సర్దుబాటులో ఎన్సీపికి సీట్లు తగ్గించాలని కాంగ్రెసు ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ముంబై వెళ్తున్నారు. కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కూడా అదే రోజు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

రెండు నుంచి నాలుగు సీట్ల కోసం కాంగ్రెసు, ఎన్సీపి కూటమి చీలడం తనకు ఇష్టం లేదని శరద్ పవార్ అన్నారు. వచ్చే నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీన ప్రారంభమవుతుంది. ఇది 25వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉంటుంది. 2004లో పోటీ చేసిన స్థానాల కన్నా 13 సీట్లను ఎక్కువ తీసుకుని కాంగ్రెసు 179 సీట్లకు ఈసారి పోటీ చేయాలని భావిస్తోంది. ఎన్సీపికి 109 సీట్లను కేటాయించాలని భావిస్తోంది. 2004 ఎన్నికల్లో ఎన్సీపి 122 స్థానాలకు పోటీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X