చిరంజీవికి హైకోర్టు ఊరట

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి హైకోర్టు నుంచి మంగళవారం ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి కింది కోర్టులో ఆయనపై, ఆయన సోదరులపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టేసింది. ఇటీవల జరిగిన లోకసభ, శాసనసభ ఎన్నికల్లో కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణపై కింది కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. అలాగే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ పై నమోదైన కోడ్ ఉల్లంఘన కేసులను కూడా హైకోర్టు కొట్టేసింది.

ఇదిలా ఉంటే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులకు ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిఫ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. 2007 ఉప ఎన్నికల్లో వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై వారి మీద కేసులు నమోదయ్యాయి. గతంలో మూడు సార్లు వారు హాజరు కాకపోవడంతో మంగళవారం కోర్టు వారిపై నాన్ బెయిలెబుల్ వారంట్లు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+