హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పథకాలపై ఫిర్యాదుకు కాల్ సెంటర్

By Staff
|
Google Oneindia TeluguNews

Vatti Vasanth Kumar
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. లోపాలపై ప్రభుత్వం దృష్టి సారించి ఈ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్ ను మంత్రి వట్టి వసంతకుమార్ శనివారంనాడు ప్రారంభించారు. ఫిర్యాదుల స్వీకరణకు 155321 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం ఇచ్చింది.

ఉపాధి హామీ, ఐకెపి, అభయహస్తం, ఇందిర ప్రభ, పింఛన్ల పథకాలపై అవకతవకలను ప్రజలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం ఇచ్చింది. గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఈ పథకాలు అమలవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. తొలి ఫిర్యాదు కెనరా బ్యాంక్ మేనేజర్ పై అందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X