జగన్ ను సిఎం చేయాల్సిందే: రోజా

Roja
కడప: దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు చేరుకోవాలంటే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే మార్గమని సినీ నటి, రాజకీయ నేత రోజా అన్నారు ఇది కేవలం వైయస్ మద్దతుదారుల డిమాండ్ మాత్రమే కాదని, యావత్ రాష్ట్ర ప్రజల మనోభీష్టమని ఆమె అన్నారు. ఆమె సోమవారం కడప జిల్లా ఇడుపులపాయలో వైయస్ జగన్ ను పరామర్శించారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే దివంగత నేత వైయస్ కు అందించే సరైన నివాళి అని ఆమె అన్నారు. పుట్టుకతోనే ఎవరూ రాజకీయాలు నేర్చుకోరని, జగన్ రక్తంలోనే వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వం ఉందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వయస్సులో తమ కన్నా చిన్నవాడైనా వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించే సత్తా జగన్ కు మాత్రమే ఉందని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం గౌరవిస్తుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందని రోజా అన్నారు.

ఇడుపులపాయలో ఉన్న జగన్ ను కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు పరామర్శించారు. జగన్ ను పరామర్శించేందుకు పెద్ద యెత్తున ప్రజలు తరలి వస్తున్నారు. తనను పరామర్శించడానికి వస్తున్న ప్రజలకు జగన్ ధైర్యవచనాలు చెబుతున్నారు. జగన్ సోమవారం మరోసారి తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిలా కూడా వైయస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+