వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో 13 మంది దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

Nandyala
కర్నూలు: కర్నూలు జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు నెత్తురోడింది. కడప జిల్లా నంద్యాల సమీపంలోని బలపనూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం శాంతిరామ్ ఆస్పత్రికి తరలించారు. ఎదురెదురుగా వస్తున్న రెండు సుమోలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సంఘటనాస్థలంలో శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

మృతుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులని తెలుస్తోంది. వారు నంద్యాలలోని సరస్వతీనగర్ కు చెందినవారని సమాచారం. సోమవారం రంజాన్ పర్వదినం నిర్వహించుకుని నంద్యాల నుంచి వీరు విహార యాత్రకు బయలుదేరారు. మృతులు 20 లోపు వయస్సున్నవారే. దీంతో సంఘటనా స్థలంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొని ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X