వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ అందరితో ఉంటా: జగన్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
కర్నూలు: మన ప్రియతమ నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకు చేయి చేయి కలుపుదామని, కలిసి నడుద్దామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లకాలువ వద్ద జరిగిన వైయస్ రాజశేఖర రెడ్డి సంస్మరణ సభలో ఆయన శుక్రవారం అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరం ఒక్క వైయస్సార్ అవుదామని, సవ్యసాచులం అవుదామని ఆయన అన్నారు. తమ ప్రియతన నాయకుడు, నాన్న చనిపోలేదని, ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఉన్నాడని, ఆ చిరునవ్వులో తానూ ఒక్కడిని అవుతానని ఆయన అన్నారు. మీ చిరునవ్వులో నేను భాగమవుతానని ఆయన అన్నారు. మీ అందరిలో నాన్న ఉన్నాడని, ఆ రకంగా అధైర్యపడవద్దని తనకు చెబుతున్నాడని ఆయన అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని కొనసాగిద్దామని ఆయన అన్నారు. రాష్ట్ర గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరినీ చదివిద్దామని, ప్రతి ఎకరాలకు గోదావరి, కృష్ణానదుల అనుసంధానం ద్వారా నీరు అందిద్దామని ఆయన చెప్పారు. మనమందరం కలిసి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి ప్రతి స్వప్నాన్ని నెరువేరుద్దామని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని, వైయస్సార్ మన అందరి జీవితాలను ప్రభావితం చేశారని, కాబట్టే నాన్న చనిపోయినా మీరంతా లక్షలాదిగా తరలి వచ్చి తనను, తన కుటుంబాన్ని ఓదార్చారని, మీ వెంట ఉంటామని తనకు ధైర్యం చెప్పారని ఆయన అన్నారు. మీరంతా ఇచ్చిన కొండంత బలం ఇచ్చారని, అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఆయన అన్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఒక పెద్ద పీడకల అయితే బాగుండనని అనిపిస్తోందని ఆయన అన్నారు. తాను పావురాల గుట్టకు వెళ్లి వచ్చానని, పావురాల గుట్టను తలుచుకున్నప్పుడల్లా నాన్న గుర్తు వస్తారని ఆయన అన్నారు. గత 20 రోజులుగా మీరంతా తనపై అభిమానం, ఆదరణ చూపారంటూ ప్రజలనుద్దేశించి జగన్ అన్నారు. తనను, తన కుటుంబాన్ని ఓదార్చారని, అందుకు రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తున్నానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X