వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్వైన్ఫ్లూ తో ప్రాణాలు పోవు: మంత్రి నాగేందర్
హైదరాబాద్: స్వైన్ఫ్లూ ప్రాణాలు తీసేంత ప్రమాదం కాదని చికిత్స ద్వారా త్వరగానే నయం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ఫ్లూ అవగాహన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రజల్లో ఈ వ్యాధిపై మరింత అవగాహన తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. గాంధీ ఆసుపత్రినుంచి ప్రారంభమైన ర్యాలీ భోలక్పూర్ వరకు కొనసాగింది. భోలక్పూర్లో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు.
Comments
Story first published: Thursday, October 1, 2009, 17:58 [IST]