ఆంధ్రరాష్ట్రం వర్షాలతో అతలాకుతలం, 26కు చేరిన వరద మృతులు

వేలాది మంది ప్రజలు సాయం కోసం వరదల్లో చిక్కుకుని ఎదురు చూస్తున్నారు. 13 వేల ఇళ్లు నేలమట్టమైనట్లు సమాచారం. గత రెండు రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం జలశయానికి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది. దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పై నుంచి పెద్ద యెత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. తుంగభద్ర నది పొంగి పొర్లుతుండడంతో కర్నూలు జిల్లా పరిస్థితి దారుణంగా తయారైంది. తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల పెద్ద యెత్తున ప్రమాదం పొంచి ఉంది. మంత్రాలయం వద్ద బస్సు నీటిలో చిక్కుకుంది. 30 మంది ప్రయాణికులు బస్సు టాప్ పైకి ఎక్కి సాయం కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టుకు గండి పడింది. దీంతో దాని కింద ఉన్న రెండు గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications