ఆంధ్రరాష్ట్రం వర్షాలతో అతలాకుతలం, 26కు చేరిన వరద మృతులు

వేలాది మంది ప్రజలు సాయం కోసం వరదల్లో చిక్కుకుని ఎదురు చూస్తున్నారు. 13 వేల ఇళ్లు నేలమట్టమైనట్లు సమాచారం. గత రెండు రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం జలశయానికి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది. దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పై నుంచి పెద్ద యెత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. తుంగభద్ర నది పొంగి పొర్లుతుండడంతో కర్నూలు జిల్లా పరిస్థితి దారుణంగా తయారైంది. తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల పెద్ద యెత్తున ప్రమాదం పొంచి ఉంది. మంత్రాలయం వద్ద బస్సు నీటిలో చిక్కుకుంది. 30 మంది ప్రయాణికులు బస్సు టాప్ పైకి ఎక్కి సాయం కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టుకు గండి పడింది. దీంతో దాని కింద ఉన్న రెండు గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది.












Click it and Unblock the Notifications