భారీ వర్షాలతో నీట మునిగిన మంత్రాలయం

కర్నూలు పట్టణం అతలాకుతలమైంది.నగరంలోని పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యుల ఇళ్లు కూడా నీట మునిగాయి. కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇల్లు జల దిగ్భంధంలో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. శాసనసభ్యులు టి.జి. వెంకటేష్, కె.ఇ. ప్రభాకర్, మేయర్ రఘురామిరెడ్డి ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలోని 30 కాలనీల్లో 5 అడుగుల మేర నీరు చేరింది.
కృష్ణా, తుంగభద్ర నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సుంకేశుల బ్యారేదీ నుంచి 6.12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సుంకేశుల బ్యారేజీకి గండి పడింది. పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తేసి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications