Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను మండిపడ లేదు: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: తాను అధికారులపై మండిపడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. ఎవరి మీదా తాను మండిపడలేదని, తనకు ఆ అలవాటు లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వరద పరిస్థితిపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాత్రమే తాను సూచించినట్లు ఆయన తెలిపారు. వరద సహాయ చర్యల కోసం అరక్కోణం, ఢిల్లీల నుంచి సైన్యం రాష్ట్రానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు.

దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వరద ప్రమాదం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. మంగళగిరి, బీచుపల్లి, కర్నూలుల్లో మూడు బెటాలియన్ల సైన్యాన్ని రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. కృష్ణా, తుంగభద్ర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 350 చెరువులకు గండి పడినట్లు ఆయన తెలిపారు. వరద తీవ్రత అధికంగా ఉన్న కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+