భయపడాల్సిన అవసరం లేదు: సబిత

కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్పీలు సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఐడి, డిఐజి కర్నూలులోనే ఉన్నారని ఆమె చెప్పారు. అనంతపురం, కడపల నుంచి అదనపు బలగాలను కర్నూలుకు తరలించినట్లు ఆమె తెలిపారు. వరద తాకిడి ప్రాంతాల ప్రజలకు ఆహారం పొట్లాలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. సైనిక బలగాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. ఇద్దరు మంత్రులు జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఆమె చెప్పారు. మంత్రాలయంలో కూడా వరద తగ్గిందని ఆమె చెప్పారు. కర్నూలు జిల్లాలో 89 గ్రామాలు ముంపునకు గురైనట్లు ఆమె తెలిపారు. కృష్ణా జిల్లాలో 16 గ్రామాలను ఖాళీ చేయించినట్లు ఆమె చెప్పారు. అవనిగడ్డకు ప్రమాదం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications