హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎక్కువ నిధులు రాబడ్తాం: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధుల రాబడ్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్టానికి వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల్లో తాను రేపటి నుంచి పర్యటిస్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆదివారంనాడు మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లో, సోమవారం కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విజయవాడల్లో, గుంటూరు జిల్లా రేపెల్లెలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. వరద సహాయానికి పూర్తి సహాయం అందిస్తామని ప్రధాని చెప్పినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందాన్ని గైడ్ చేసేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా చేసే సహాయక చర్యలకు కేంద్రం పూర్తిగా అండదండలు అందిస్తుందని ఆయన చెప్పారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో తాను ఇప్పటి వరకు వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించలేదని ఆయన చెప్పారు. సోమవారంనాడు 12వ తేదీన నంద్యాల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X