కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కాన్వాయ్ కి ఎస్ ఎఫ్ ఐ అడ్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
కర్నూలు: వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కె.రోశయ్యకు బాధితుల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ప్రజలు నిరసనలతో స్వాగతం పలుకుతున్నారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద రోశయ్య కాన్వాయ్ ని ఎస్ఎఫ్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్న రోశయ్య రెండో రోజు సోమవారం ఇక్కడికి వచ్చారు. వరద తాకిడి ప్రాంతాల్లోని విద్యార్థులను ఆదుకోవాలని ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

కర్నూలు పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలు తీవ్ర వరద తాకిడికి గురయైన విషయం తెలిసిందే. వరద తాకిడి ప్రాంతాల్లో ఇంతకు ముందు ఏరియల్ సర్వే నిర్వహించిన రోశయ్య ఆదివారం నుంచి పర్యటనలు ప్రారంభించారు. ఆయనకు ఆదివారం నాడు కూడా బాధితుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X