ఓటేసిన సచిన్, అంబానీ, పవార్

రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమగ్రాభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని, ధరల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపదని శరద్ పవార్ అన్నారు. దేశ్ ముఖ్ తన కుటుంబ సభ్యులతో కలిసి లాతూరు జిల్లాలోని తన సొంత గ్రామం భాబల్ గావ్ లో ఓటేశారు. కాంగ్రెసు - ఎన్సీపి కూటమికి మెజారిటీ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆయన కూతురు, షోలాపూర్ కాంగ్రెసు అభ్యర్థి ప్రణతి షిండే, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్, బిజెపి అభ్యర్థి పూనమ్ మహాజన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications