వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Polling
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్ మంగళవారం సాయంత్రం ముగిసింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి, భారీ పోలింగ్ నమోదైంది. స్వల్ప హింసాత్మక సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలోని ఒక పోలింగ్ బూత్ లో ఏజెంట్ హత్యకు గురయ్యాడు. నక్సలైట్లు పోలింగ్ బూత్ పై దాడి చేశారు. గస్తీ పోలీసు బృందంపై కూడా దాడి చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో భారీగా 70 శాతం పోలింగ్ నమోదు కాగా, మహారాష్ట్రలో మధ్యాహ్నం 3 గంటల వరకు 44.5 శాతం, హర్యానాలో 50 శాతం పోలింగ్ నమోదైంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపితో అధికారం పంచుకుంటున్న కాంగ్రెసు బిజెపి - శివసేన కూటమి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది.పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. నక్సల్స్ ప్రభావం ఉన్న మహారాష్ట్రలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రచార పర్వం దాదాపు ప్రశాంతంగా ముగిసినప్పటికీ నక్సల్స్ హింస ప్రమాదకరంగా పరిణమించింది. గత వారం గడ్చిరోలీ జిల్లాలో మావోయిస్టులు 17 మంది పోలీసులను బలి తీసుకున్నారు. ఈ జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ సుడిగాలి పర్యటనలు చేశారు. బిజెపి నేతలు ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ఎం. వెంకయ్యనాయుడు ప్రచారంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X