విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిడబ్ల్యుసి హెచ్చరికలు రాలేదు: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
విజయవాడ: రాష్ట్రంలో సంభవించిన వరదలపై రాష్ట్రానికి కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ రాలేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. సడబ్ల్యుసి 26 గంటల ముందే హెచ్చరికలు చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. వరద బాధితుల పరామర్శ కోసం వచ్చిన ఆయన మంగళవారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరదలు రావడంలో ఏ విధమైన మానవ తప్పిదం లేదని ఆయన చెప్పారు.

అధికారులు సకాలంలో స్పందించారు కాబట్టే మరణాల సంఖ్యను పెద్ద యెత్తున తగ్గించగలిగామని ఆయన అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వరద తాకిడి ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్ లో హైదరాబాదు బయలుదేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X