హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ నిర్మాత ఏడిద ఇంట్లో చోరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Edida Nageswar Rao
హైదరాబాద్: హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో గల సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు నివాసంలో గురువారం తెల్లవారు జామున చోరీ జరిగింది. బీరువాలోంచి 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఏడిద నాగేశ్వర రావు కుమారుడు రాజా ముఖంపై మత్తు మందు చల్లి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.

దుండగులు మారు తాళాలతో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి లోనికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. బీరువా తలుపులు తెరిచి దొంగతనానికి పాల్పడిన విషయాన్ని గుర్తించి రాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X