వైయస్ జగన్ పై తొందరపాటు ఉండదు: వివేకా

పులివెందుల శాసనసభ ఉప ఎన్నిక అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. వైయస్ మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. పార్టీలో జగన్ వర్గం, రోశయ్య వర్గం అనేవి లేవని, ఆవన్నీ మీడియా సృష్టేనని ఆయన అన్నారు. తమది ఒక్కటే కాంగ్రెసు వర్గమని ఆయన అన్నారు. తాము తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలూ తెలుసునని, అధిష్టానమే అన్నీ చూసుకుంటుందని ఆయన అన్నారు. ప్రజల, మెజారిటీ శాసనసభ్యులు మనోగతాన్ని సోనియా గౌరవిస్తారని అనుకుంటున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications