మాజీ మంత్రి నిమ్మ రాజిరెడ్డి మృతి

నిమ్మ రాజిరెడ్డి వరంగల్ జిల్లాలో 1937 మార్చి 9వ తేదీన జన్మించారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఆయన తొలిసారి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన వరంగల్ జిల్లాలోని చేర్యాల నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రాజిరెడ్డి కాంగ్రెసు పార్టీలోనూ తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ పని చేశారు.












Click it and Unblock the Notifications