వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఏడాది నుంచి టెన్త్ లో గ్రేడింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

SSC Exams
హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 592 నెంబర్ జీవోను జారీ చేసింది. ఈ గ్రేడింగ్ విధానం వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుంది. దీని వల్ల పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు ఉండవు. పాస్ కాని విద్యార్థులకు కూడా గ్రేడింగ్ ఇస్తారు. మొత్తం 9 గ్రేడ్ లు ఇస్తారు.

పదో తరగిత ఎస్ఎస్సీలో గ్రేడింగ్ విధానం వల్ల ఫలితమేమీ ఉండదని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గదని ఆయన అన్నారు. విద్యావిధానంలో లోపాలను సరిదిద్దకుండా గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టడం వల్ల లాభం లేదని ఆయన అన్నారు. ప్రస్తుత విధానమే ఉంటూ గ్రేడింగ్ ఇస్తే ఫలితమేమిటని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X