పులివెందులలో వైయస్ జగన్ పోటీ?

రాష్ట్ర రాజకీయాల్లోనే తన సేవలు అందిస్తానని ప్రకటించిన జగన్ పులివెందులలో పోటీకే సిద్ధపడతారని అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆయన పరోక్షంగా తన రాజకీయ వ్యూహాన్ని బయటపెట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యగా మారడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అందుకు అంగీకరిస్తారా అనేది ప్రశ్నార్థకమే. సోనియా నిర్ణయాన్ని శిరసా వహిస్తానని జగన్ చెప్పుకున్నారు. ఈ స్థితిలో సోనియా పులివెందులలో జగన్ పోటీకి అంగీకరించే పరిస్థితులు లేవని అంటున్నారు. వైయస్ సతీమణి విజయలక్ష్మిని గానీ కూతురు షర్మిళను గానీ పోటీకి పెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏమైనా, జగన్ అసమ్మతి రాజకీయాలు ఊపందుకుంటాయని ప్రచారం జరుగుతోంది.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications