పులివెందులలో వైయస్ జగన్ పోటీ?

రాష్ట్ర రాజకీయాల్లోనే తన సేవలు అందిస్తానని ప్రకటించిన జగన్ పులివెందులలో పోటీకే సిద్ధపడతారని అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆయన పరోక్షంగా తన రాజకీయ వ్యూహాన్ని బయటపెట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యగా మారడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అందుకు అంగీకరిస్తారా అనేది ప్రశ్నార్థకమే. సోనియా నిర్ణయాన్ని శిరసా వహిస్తానని జగన్ చెప్పుకున్నారు. ఈ స్థితిలో సోనియా పులివెందులలో జగన్ పోటీకి అంగీకరించే పరిస్థితులు లేవని అంటున్నారు. వైయస్ సతీమణి విజయలక్ష్మిని గానీ కూతురు షర్మిళను గానీ పోటీకి పెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏమైనా, జగన్ అసమ్మతి రాజకీయాలు ఊపందుకుంటాయని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications