కెసిఆర్ పై చంద్రబాబు మండిపాటు

బాధ్యతలు విస్మరిస్తున్న మంత్రులను నియంత్రించడంలో ముఖ్యమంత్రి రోశయ్య విఫలమవుతున్నారని ఆయన అన్నారు. ప్రజల డబ్బుతో ఊరేగే బదులు మంత్రులు శానిటేషన్ పై దృష్టి పెడితే మంచిదని ఆయన అన్నారు. బిసీలను ప్రభుత్వం రకరకాలుగా అణగదొక్కుతోందని ఆయన విమర్శించారు. జీవో 3, జీవో 49లను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము బిసీ రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ కు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. గతంలో కూడా కాంగ్రెసు ప్రభుత్వ అవినీతి చర్యలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారానికి తాము అందరితో కలిసి పోరాటం చేశామని ఆయన చెప్పారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి లతో పోరాడామని, ఇప్పుడు రోశయ్యతో కూడా పోరాడుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసులో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, తాము మాట్లాడేది ఏమీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications