హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మినిస్టర్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని బేగంపేట మినిస్టర్స్ రోడ్డులో గల ఒక రబ్బరు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద యెత్తున మంటలు ఎగిసి పడుతుండడంతో పక్కన అపార్టుమెంట్లలో ఉన్న ప్రజలు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. వారు అపార్టుమెంట్లను ఖాళీ చేసి బయటకు వెళ్తున్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మూడు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి.

సెల్లార్ లో నిల్వ ఉంచిన రబ్బరు తగలబడడంతో మంటలు లేచాయి. వెంకటేశ్వర ఎంటర్ ప్రైజెస్ కు చెందిన ఈ గోదాంలో కార్ల విడిభాగాలు కూడా నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X