వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్ లో పేలుడు: 70 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Peshawar
పెషావర్: పాకిస్తాన్ లో పెషావర్ లో బుధవారం రద్దీ ఉండే మార్కెట్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 70 మంది దాకా మరణించారు. మార్కెట్ లోని దుకాణాలు కుప్పకూలి మరణాలు సంభవించాయి. పెషావర్ లోని మీనా బజారులో ఈ దారుణం సంభవించింది. భారీ మంటలు లేచి బీభత్సం చోటు చేసుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇస్లామాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుడు సంభవించింది.

భారీ పేలుడు సంభవించిందని, ఎక్కడ చూసిన పొగ, ధూళి అలుముకుందని, రోడ్డుపై మనుషులు చచ్చి పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శిథిలాల నుంచి ప్రజలను పోలీసులు ఇతర స్థలాలకు తరలిస్తున్నారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొంత మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అధికారి షఫ్కాత్ మాలిక్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. దాదాపు 70 మంది మరణించారని, 170 మంది దాకా గాయపడ్డారని వైద్యుడు జాఫర్ ఇక్బాల్ అంటున్నారు. మృతుల్లో 12 మంది మహిళలు, పలువురు పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X