తెరాస జైల్ భరో: కెసిఆర్ ఆరెస్టు
తెరాస కార్యకర్తలకు,పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించారు. ఫ్రీజోన్ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ జయశంకర్ కూడా ఈ సభలో మాట్లాడారు. తాము రాష్ట్రపతి ఉత్తర్వులకు, 610 జీవోకు అనుకూలమేనని అన్ని పార్టీలు చెబుతున్నప్పటికీ వాటి అమలుకు మాత్రం పని చేయడం లేదని జయశంకర్ విమర్శించారు.
Story first published: Wednesday, October 28, 2009, 16:16 [IST]