చిరుతో పొత్తుపై జగన్ క్యాంప్ సీరియస్

జగన్ ను సోమవారంనాడు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, శాసనసభ్యులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, జయసుధ తదితరులు కలిశారు. తాజా పరిణామాలపై వారు జగన్ తో మాట్లాడారు. ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయం తమ పార్టీకి చెందిన వారి కుట్ర అని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పొత్తుకు వ్యతిరేకంగా తాము తీర్మానం చేస్తామని, ఆ తీర్మానాన్ని అందజేసి పొత్తు పెట్టుకోకుండా అధిష్టానాన్నిఒప్పిస్తామని ఆయన అన్నారు.
జగన్ కు అనుకూలంగా ఉన్న రఘువీరా రెడ్డి, దానం నాగేందర్ వంటి మంత్రులు, కొంత మంది శాసనసభ్యులు ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. జగన్ ను అణచివేయడంలో భాగంగానే చిరంజీవితో పొత్తుకు సిద్ధపడినట్లు వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ వర్గాన్ని ఎంతగా అణగదొక్కాలనుకుంటే అంతగా పైకి లేస్తుందని మంత్రి రఘువీరా రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించడాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications