వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకుంటా: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: సోనియాగాంధీని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య మరింత నిబ్బరంగా కన్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనపై పూర్తి విశ్వాసం ఉంచారని, ఆ విశ్వాసానికి అనుగుణంగా తన పనితీరును నిరూపించుకుంటాననిఆయన చెప్పారు. ఏదో ఒక బలమైన సామాజిక వర్గానికి తాను నాయకుడు కానప్పటికీ తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చారని, అందువల్ల అధిష్ఠానం విశ్వాసాన్ని వమ్ము చేయబోనని అన్నారు. అధిష్ఠానం తనకు అన్ని రకాల అండదండలు అందిస్తున్నట్లు చెప్పారు. శనివారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, కోర్‌ కమిటీ సభ్యులు చిదంబరం, ఎ.కె.ఆంటోనీని కలిసిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

ఐదేళ్లు సీఎం పదవిలో ఉంటారా అన్న ప్రశ్నకు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాననడానికి కాలపరిమితి అంటూ ఉండదని అన్నారు. జగన్‌ వర్గం కార్యకలాపాల గురించి సోనియా ఆరా తీశారని వెల్లడించారు. సాయంత్రం జగన్‌ కూడా మిమ్మల్ని కలుస్తున్నారని చెప్పినప్పుడు వారి కుటుంబానికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఆమె చెప్పారని తెలిపారు. పార్టీని కలిసికట్టుగా, సంఘటితంగా ఉంచే బాధ్యతను అధిష్ఠానం తనపై ఉంచిందని చెప్పారు. 33 మంది కాంగ్రెస్‌ ఎంపీలను అందించిన ఆంధ్రప్రదేశ్‌ తమకు ముఖ్యమైన రాష్ట్రమని ఆమె చెప్పారని వెల్లడించారు. సీఎల్పీ సమావేశం గురించి తనను ఆరా తీశారని, హైకోర్టులో ఈ అంశంపై ప్రజాహిత వ్యాజ్యం ఉందని చెప్పానని తెలిపారు.

ఈ విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటానని మేడమ్‌ చెప్పినట్లు వెల్లడించారు. త్వరలోనే సీఎల్పీ సమావేశ తేదీని ఆమె నిర్ణయించవచ్చని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి తాను చర్చించలేదని, మొదటి పర్యటనలోనే అన్ని అధికారాలను తనకు ఇవ్వాలని కోరలేకపోయానని అన్నారు. విస్తరణ అవసరమని భావిస్తే తాను అధిష్ఠానం సలహా కోరతానని స్పష్టం చేశారు. తాను, జగన్‌ కుటుంబం ఒకే రోజు వేర్వేరు సమయాల్లో మేడమ్‌ను కలుసుకోవడంలో రాజకీయ ప్రాధాన్యతేమీ లేదని, యాదృచ్ఛికంగా జరిగిందని అన్నారు.

కొండా సురేఖ రాజీనామా సమర్పించడం, మరికొంతమంది రాజీనామాలు చేస్తానని హెచ్చరించడంపై సోనియా వద్ద ప్రస్తావించడం అనవసరమనుకున్నామని తెలిపారు. పీఆర్పీతో పొత్తు విషయంలో గందరగోళం ఏమీ లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని, ఈ విషయంలో పార్టీ వైఖరి మారలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై కమిటీకి త్వరలో మరో కన్వీనర్‌ను నియమించి, పునర్వ్యవస్థీకరిస్తానని వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X