హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ తో విభేదాలు లేవు: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో తనకు ఏలాంటి విభేదాలు లేవని కాంగ్రెసు శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం డి.శ్రీనివాస్ ను కలుసుకున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన లక్ష్మారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెసు పొత్తు ప్రయత్నాలను వ్యతిరేకించారు. డి. శ్రీనివాస్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిలో లక్ష్మారెడ్డి డిఎస్ తో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

డిఎస్ పై తాను అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని లక్ష్మారెడ్డి డిఎస్ తో భేటీ అనంతరం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో అభ్యర్థులను మార్చాలని తాను డిఎస్ ను కోరానని, ఆ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. స్థానిక శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను మార్చాలని తాను కోరానని, శాసనసభ్యులను విశ్వాసంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X