శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య సమర్ధ ముఖ్యమంత్రి: పురందేశ్వరి

By Santaram
|
Google Oneindia TeluguNews

Purandeswari
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి రోశయ్య సమర్థవంతమైన నేత అని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఆయన అమలుచేస్తారని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి విలేఖరులతో మాట్లాడుతూ వైయస్ జగన్‌కు సీఎం పదవి ఇవ్వాలా? వద్దా అన్నది అధిష్ఠానం ఇష్టమన్నారు.

అసమ్మతివాదిగా ముద్రపడడం ఎంత ఇబ్బందికరమో గతంలో హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అసమ్మతి కార్యకలాపాలు సాగించకుండా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. వ్యక్తి కంటే పార్టీ గొప్పదని సోనియా గాంధీ ఎప్పుడూ చెబుతుంటారని..ఆమె సందేశానుసారం నడుచుకుంటానని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X