హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూనియర్ డాక్టర్లపై హైకోర్టు ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: జానియర్ డాక్టర్ల సమ్మెపై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపకార వేతనం పెంచినా సమ్మెను ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలని హైకోర్టు జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. జూనియర్ డాక్టర్లకు పెంచిన ఉపకార వేతనం వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జూనియర్ డాక్టర్లకు ఉపకార వేతనం పెంచుతున్నామని, ఈసారి పెంచిన ఉపకార వేతనాన్ని వచ్చే ఏడాది జనవరి వేతనంతో కలిపి ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని వైద్య విద్య శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి మరోసారి జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే తమ సమ్మెను విరమించడానికి జూనియర్ డాక్టర్లు నిరాకరిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అంటున్న హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ తాము కూడా ప్రజలమేనని గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X