విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోడోల చెర నుంచి కృష్ణారావు విడుదల

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: నెల రోజుల క్రితం అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీర్ కృష్ణారావు బోడోల చెర నుంచి విడుదలయ్యారు. ఈ సమాచారం కృష్ణా జిల్లా గన్నవరంలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అసోం రాష్టానికి చెందిన బోడో తీవ్రవాద సంస్థ ఆయనను విడుదల చేసింది. అసోంలో నిర్మిస్తున్న 37వ జాతీయ రహదారి ప్రాజెక్టులో ఈపిసి అండ్ ఐసి గాయత్రి కన్ స్ట్రక్షన్ కంపెనీలో కృష్ణారావు ఇంజినీరుగా పనిచేస్తున్నారు.

కృష్ణారావును అసోంలోని కోక్జార్ జిల్లా జోయ్ పూర్ సమీపంలో బోడోలు అక్టోబర్ 16వ తేదీన కిడ్నాప్ చేశారు. కృష్ణారావు క్షేమంగా బయటపడడంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రానికి ఆయన తాను పనిచేస్తున్న సంస్థకు చేరుకునే అవకాశం ఉంది. ఆయన విడుదలకు బోడోలు రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X