హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యతో వైయస్ జగన్ ఢీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తొలిసారి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో ప్రత్యక్ష వివాదానికి దిగారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల సమావేశంలో వారిద్దరికి మధ్య మంగళవారం సాయంత్రం వివాదం జరిగింది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాల అమలును ముందుకు తెచ్చి రోశయ్యను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ రోశయ్య సమావేశంలో మొదట మాట్లాడారు. ఉచిత విద్యుత్తును, రేషన్ బియ్యం కోటాను పెంపును వెంటనే అమలు చేయలేని స్థితి ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాలపై కొంత మంది పార్లమెంటు సభ్యులు మాట్లాడిన తర్వాత జగన్ మాట్లాడారు.

ప్రభుత్వం విశ్వసనీయతను పెంచుకోవాలని, గతంలో వైయస్సార్ విశ్వసనీయతే పార్టీ బలమైందని జగన్ అన్నారు. వైయస్సార్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు 9 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యుత్తు కంపెనీలు 20 శాతం విద్యుత్తును అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ జీవోను రద్దు చేసి లేదా విద్యుత్తును కొనుగోలు చేసి రైతులకు 9 గంటలు విద్యుత్తు ఇవ్వాల్సిందేనని జగన్ అన్నారు. దానికి రోశయ్య స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలు 20 శాతం విద్యుత్తును అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లోని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తాను మార్పు చేయలేదని చెప్పారు. జగన్ ను మంత్రి బొత్సా సత్యనారాయణ సమర్థించే ప్రయత్నం చేశారు. దానికి రోశయ్య చురక వేశారు. దాంతో బొత్సా వెనక్కి తగ్గారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X