హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజాపై భువనేశ్వరి రుసరుసలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: తిరిగి పార్టీలో చేరడానికి ప్రముఖ సినీ నటి రోజాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవి అడ్డు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు తాజా రాజకీయాల నేపథ్యంలో రోజా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె పార్టీ నాయకులు కె.ఎర్రంనాయుడు, పయ్యావుల కేశవ్, రేవంత్ రెడ్డిల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారు చంద్రబాబుకు ఈ విషయంపై నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే చంద్రబాబు రోజాను తిరిగి చేర్చుకోవడానికి వెనకాడుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

రోజాను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి భువనేశ్వరి వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలు చేసిన రోజాను చేర్చుకోవడం మంచిది కాదని ఆమె చంద్రబాబుతో అన్నట్లు వినికిడి. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎర్రంనాయుడు తదితరులతో అన్నారని సమాచారం. పార్టీపై విమర్శలు చేసి ప్రజారాజ్యంలోకి వెళ్లి మళ్లీ వచ్చిన టి. దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాంలను చేర్చుకున్నప్పుడు రోజాను చేర్చుకోవడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని వారు చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X