కాంగ్రెసువి 'గాలి' కబుర్లు: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu
హైదరాబాద్: కాంగ్రెసు నాయకులవి గాలి కబుర్లని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కర్నాటకలో రాజకీయ సంక్షోభం నెలకొందని కాంగ్రెసు నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. కర్నాకటలో తాము శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని, దాన్ని బట్టి కర్నాటకలో రాజకీయ సంక్షోభం ఉందో లేదో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నదని, దివంగత నేతకు సంతాపం కూడా ప్రకటించలేకపోతోందని ఆయన అన్నారు. కర్నాటకలో రాజకీయ సంక్షోభం ఉన్నట్లా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లా అని ఆయన అడిగారు.

తాను బిజెపి అధ్యక్ష పదవికి పోటీలో లేనని ఆయన స్పష్టం చేశారు. నితిన్ గడ్కరీని ఆర్ఎస్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సూచించిన విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో యువకులకు పార్టీ నాయకత్వాన్ని అప్పగిస్తామని ఆయన చెప్పారు. గడువు లోగానే లోకసభ ప్రతిపక్ష పదవి నుంచి తప్పుకోవడానికి అద్వానీ ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+