మిశ్రమ ఫలితాలు: గ్రేటర్ లో పై'చేయి'
తెలుగుదేశం, మజ్లీస్ పార్టీలు పోటాపోటీగా స్థానాలు సాధించాయి. కాంగ్రెసుకు ధీటుగా తెలుగదేశం పార్టీకి 45 స్థానాలు లభించాయి. మజ్లీస్ పార్టీ ఆ రెండు పార్టీలకు పోటీగా స్థానాలు దక్కించుకుంది. పాతబస్తీలో ఏకపక్షంగా మజ్లీస్ విజయం సాధించిందని చెప్పవచ్చు. మజ్లీస్ 43 డివిజన్లలో విజయబావుటా ఎగురేసింది. చిన్న పార్టీలను గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు చితగ్గొట్టారు. బిజెపికి ఐదు స్థానాలు దక్కాయి. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ఎట్టకేలకు ఒక్క సీటును గెలుచుకుంది. ఇతరులు నాలుగు సీట్లు గెలుచుకున్నారు. జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తా పార్టీ పత్తా లేకుండా పోయింది.
Comments
hyderabad prajarajyam హైదరాబాద్ తెలుగుదేశం ప్రజారాజ్యం congress mim telugu desam greater hyderabad గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు ఎంఐఎం మజ్లీస్ majlis
Story first published: Thursday, November 26, 2009, 14:08 [IST]