వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైలకు ప్రధాని మన్మోహన్ పిలువు

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
: భారత అభివృద్ధిలో పాలు పంచుకోవాలని భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అమెరికాలోని ఎన్నారైలకు పిలుపునిచ్చారు. నిజమైన అమెరికా, భారత్ ల మధ్య మేధో, వ్యాపార భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఆధునిక సాంకేత పరిజ్ఞానాన్ని, విధానాల వెసులుబాటును వాడుకోవాలని ఆయన ఎన్నారైలకు సూచించారు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్ ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు.

భారత్ ను కూడా ఆర్థిక మాంద్యం తాకినప్పటికీ శ్వాసను తీసుకుని ముందుకు సాగగలుగుతున్నామని ఆయన చెప్పారు. స్థిరమైన అభివృద్ధి సాధనకు అవసరమైన ఆర్థిక పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. కొత్త సవాళ్లు, అవకాశాలతో పెరుగుదల సాధ్యమవుతోందని ఆయన అన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాల్లో కాకుండా భారత్ లోని విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు అవసరమని ఆయన చెప్పారు. విజయానికి వనరుల కన్నా సృజనాత్మక ఆలోచన, నూతన ఆవిష్కరణలు అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X