హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ ఫలితాలపై అంతర్మథనంలో డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంతర్మథనంలో పడిన సూచనలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనీసం 70 డివిజన్లలోనైనా గెలుస్తామని ఆశించిన కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగిలింది. గుడ్డిలో మెల్లలా ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా కాంగ్రెసు అవతరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక శాసనసభా సీటును మాత్రమే గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పుంజుకుంది. ఇది కాంగ్రెసుకు మరింత ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలుతాయని భావించిన కాంగ్రెసుకు తీవ్ర అసంతృప్తే మిగిలింది. ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలు ఆశించిన స్థాయిలో సత్తా చాటకపోవడం కాంగ్రెసుకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఆరు నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సానుభూతి పవనాలు కూడా లేవు. కాంగ్రెసు శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకున్నట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోంది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి శాసనసభా నియోజకవర్గాల్లో పార్టీ ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో అప్పుడే పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పరస్పరం దుమ్మెత్తి పోసుకునే వాతావరణం మొదలైంది. మంత్రి ముఖేష్ నియోజకవర్గంలో కూడా పార్టీకి దెబ్బ తగిలింది. తమ తమ నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు సాధించని మంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెసు మహిళా విభాగాం అధ్యక్షురాలు గంగా భవానీ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ వైయస్ జగన్ వ్యతిరేక వర్గీయుల నుంచి మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం డి. శ్రీనివాస్ కు గానీ ముఖ్యమంత్రి కె.రోశయ్యకు గానీ అంత సులభం కాదు. పరిస్థితి చేయి దాటుపోతుందేమోననే ఆందోళనలో డి. శ్రీనివాస్ ఉన్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X