హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ హడావిడి: పెద్దాయనకు లైన్ క్లియర్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేతగా ముఖ్యమంత్రి కె.రోశయ్యకు లైన్ క్లియర్ అయింది. సిఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బెంగుళూర్ నుంచి శుక్రవారంనాడే హైదరాబాద్ వచ్చారు. ఆయన అనుకున్నదాని కన్నా కాస్తా ఆలస్యమైంది. దీంతో ఆయనకు సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు చాలా సేపు భేటీకి ఎదురు చూశారు. ఆయన హైదరాబాద్ రాగానే పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆయనతో భేటీ అయి సిఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాగా, జగన్ వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీలతో సమావేశమయ్యారు. వారు జగన్ కు సిఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన పద్ధతిపై వివరించినట్లు తెలిసింది. దీంతో రోశయ్యను తమ నేతగా ఎన్నుకునేందుకు లైన్ క్లియర్ అయినట్లు చెబుతున్నారు. కేంద్ర పరిశీలకులతో ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా సమావేశమయ్యారు.

కాగా, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెసు శాసనసభ్యులు ప్రకటిస్తున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయనందుకు కలత చెంది మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అధిష్టానం చెప్పినట్లే జరుగుతుందని సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తమ అభిప్రాయాలకు అవకాశమిస్తే మాట్లాడ్తామని ఆయన చెప్పారు. తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని టిజి వెంకటేష్, తూర్పు జయప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు. కాంగ్రెసు సిఎల్పీ సమావేశానికి కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వచ్చారు. సిఎల్పీ నేతగా రోశయ్య పేరును జగన్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు జగన్ ను ప్రణబ్, మొయిలీ ఒప్పించారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X