'గాలి' వజ్ర కిరీటంపై టిటిడి మల్లగుల్లాలు
గాలి జనార్దన్ రెడ్డి నుంచి రశీదును ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఇప్పుడు టిటిడి పాలక మండలిలో చర్చ సాగుతోంది. అది నలుపా, తెలుపా అనే విషయంపై కూడా సందిగ్ధంలో పడుతున్నారు. అయితే, గాలి జనార్దన్ రెడ్డి అట్టహాసంగా అందరికీ తెలిసే విధంగా దాన్ని సమర్పించినందున నలుపా, తెలుపా అనే సందేహాలు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి శ్రీవారి ఆభరణాలను లెక్కిస్తారు. ఈ సమయంలో వజ్ర కిరీటం ధరపై సందేహాలు తలెత్తాయి.
Story first published: Friday, November 27, 2009, 11:21 [IST]