హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ నీరసంగా ఉన్నారు: పువ్వాడ

By Pratap
|
Google Oneindia TeluguNews

CPI
ఖమ్మం: ఖమ్మం జిల్లా సబ్ జైలులో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నీరసంగా ఉన్నారని సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వర రావు చెప్పారు. ఆయన సోమవారం ఉదయం జైలులో కెసిఆర్ ను కలిశారు. కెసిఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే నీరసంగా ఉన్నారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. కెసిఆర్ ను ఎవరినీ కలిసే పరిస్థితి ఉన్నట్లు లేదని ఆయన అన్నారు.

కెసిఆర్ ను పోలీసులు జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టే ఉద్దేశంతో ఉన్నట్లు లేరని, కెసిఆర్ ఎవరినీ కలిసేందుకు సిద్ధంగా లేరని, అందుకు కెసిఆర్ తయారై లేరని ఆయన చెప్పారు. తాను వచ్చిన తర్వాత పది, పదిహేను నిమిషాలు ఉండాలని చెప్పి తయారై వచ్చారని ఆయన చెప్పారు. ఈ జైలు బాగా లేదని ఆయన చెప్పినట్లు పువ్వాడ తెలిపారు. జిల్లా కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు రెండో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు రాయించారని, అయితే కెసిఆర్ ను జిల్లా కోర్టులో ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X