వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంయమనం పాటించండి: పోలీసులకు రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా జరుగుతున్న బంద్ సందర్భంగా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య పోలీసులను ఆదేశించారు. తెరాస అరెస్టు నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చకు ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానంతరం రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థి శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై రోశయ్య ఆరా తీసినట్లు ఆమె తెలిపారు.

శ్రీకాంత్ చికిత్సకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆమె చెప్పారు. మనిషి ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని, తగిన చర్యలు తీసుకుంటుందని ఐటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టమైన వైఖరితో ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ చెప్పారు. తెలంగాణపై నిర్ణయాన్ని తాము పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వదిలేశామని, దీనిపై ఏకాభిప్రాయ సాధన కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని, యుపిఎ భాగస్వామ్య పక్షాలతో ఆ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X