తెలంగాణ అంతటా తెరాస బంద్

విద్యాసంస్థలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. సింగరేణిలో కూడా బంద్ సాగుతోంది. హైదరాబాద్ లోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో కూడా బస్సులు నడవడం లేదు. రంగారెడ్డి జిల్లా తాండూరు, పరిగి తదితర ప్రాంతాల్లో కూడా బస్సులు తిరగడం లేదు. తెలంగాణలోని బస్సు స్టాండ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. రద్దీగా ఉండే హైదరాబాదులోని కోఠీ, తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు కనిపించడం లేదు. హైదరాబాదులో మునుపెన్నడూ లేని వాతావరణం నెలకొని ఉంది. ఉద్యోగులు మాత్రం కార్యాలయాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ ఓదెలులో తెరాస కార్యకర్తలు రైలు రోకో నిర్వహించారు.












Click it and Unblock the Notifications