తోసుకొచ్చిన కెసిఆర్: తోపులాట, ఉద్రిక్తత

ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని, తనపై దుష్ప్రచారానికి ఒడిగట్టిందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించినట్లు తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని ఆయన అంటున్నారు. దీన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, తన వాదనను న్యాయమూర్తి ముందు వివరించేందుకు అవకాశం కల్పించాలని ఆయన అంటున్నారు. కెసిఆర్ ఉన్న గదిలోకి మీడియాను వెళ్లనీయడం లేదు. దీంతో లోపల ఏం జరుగుతోందనే విషయం తెలియడం లేదు. కెసిఆర్ ను చంపేందుకు కూడా కుట్ర జరుగుతోందని తెరాస నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్దకు పెద్ద యెత్తున తెరాస కార్యకర్తలు చేరుకుంటున్నారు. తనను అక్రమంగా ప్రభుత్వాస్పత్రిలో నిర్బంధించారని కెసిఆర్ ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వ వైద్య పరీక్షలను కూడా నిరాకరిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులను కెసిఆర్ వద్దకు పంపారు. సెలైన్ ఎక్కించుకోవడం లేదని తెలుస్తోంది. మందులు కూడా ఆయన తీసుకోవడం లేదు.












Click it and Unblock the Notifications