విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో 24 గంటలు, రోశయ్య టూర్ స్కెచ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
విజయవాడ: రాష్ట్రముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వారం రోజుల్లో నగరంలో పర్యటించే అవకాశం ఉంది. పర్యటన తేదీని ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి ముఖ్యమంత్రి బుధ, గురురాల్లోనే ఇక్కడకు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి పూర్తిగా ఒక రోజు నగరంలో ఉంటానని చెప్పడంతో, ఆ మేరకు ఇక్కడి కార్యక్రమాలు ఖరారు చేయడం కోసం కసరత్తు జరుగుతోంది. సెంట్రల్‌ నియోజకవర్గంలో వాటర్‌ ట్యాంక్‌, ఇతర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయించాలని చూస్తున్నారు.

ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ముందస్తుగానే స్థానికుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చూడడం కోసం జ్వరాలను ఆరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రాకకు ముందే "రచ్చబండ" కార్యక్రమాన్ని రెపు నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ మృతి చెందిన రోజును సంస్మరించుకుంటూ బుధవారం నగరంలో 'రచ్చబండ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. బీసెంట్‌రోడ్డులోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాటాడుతూ, సెప్టెంబరు 2వతేదీన వైఎస్‌ మరణించారని, ఆయన తలపెట్టిన పథకాలను మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X