పులివెందుల నుంచి విజయలక్ష్మి ఎన్నిక

YS Vijayalakshmi
కడప: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులివెందుల నియోజకవర్గానికి బుధవారం సాయంత్రానికి విజయలక్ష్మి నామినేషన్ ఒక్కటే దాఖలైంది. నామినేషన్ల దాఖలుకు బుధవారం సాయంత్రంతో గడువు ముగిసింది. మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నామినేషన్ల గడువు ముగిసిన వెంటనే కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ బెంగుళూర్ కు వెళ్లారు. తల్లితో పాటు ఆయన బెంగుళూర్ నుంచి పులివెందులకు వచ్చారు. విజయలక్ష్మి నామినేషన్ ను ఆయన దగ్గరుండి వేయించారు. ఈ సందర్భంగా పులివెందులలో భారీ సభను కూడా ఏర్పాటు చేశారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 5వ తేదీ. వైయస్ విజయలక్ష్మి ఎన్నికైనట్లు అదే రోజు అధికారికంగా ప్రకటిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+