వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సీపట్నం కోర్టుకు కోబాడ్ గాంధీ, ఉద్రిక్తత

By Santaram
|
Google Oneindia TeluguNews

Narsipatnam
నర్సీపట్నం: సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్దాంతకర్త, అగ్రనేతగా పోలీసులు భావిస్తున్న కోబాడ్‌ గాంధీని బుధవారం అత్యంత నాటకీయ పరిణామాల నడుమ నర్సీపట్నం కోర్టులో హాజరుపరిచారు. జెడ్‌ కేటగిరి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు గాండి వెంట వచ్చాయి. అంతకు ముందు ఉదయం నుంచే నర్సీపట్నం కోర్టు ఆవరణ లో మఫ్టీలో పోలీసు బలగాలు తిరిగాయి.

గాంధీని నర్సీపట్నం కోర్టులో హాజరుపరచడానికి తీసుకువస్తున్న నేపథ్యంలో విశాఖ ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నం వచ్చే అన్ని మార్గాల్లోను వాహనాల తనిఖీ చేపట్టారు. నర్సీపట్నం నుంచి చింతపల్లి, కేడిపేట, తుని, అనకాపల్లి వైపు వెళ్లే రహదార్లుపై పోలీసు నిఘా పెట్టారు. లొంగిపోయిన గిరిజన మిలీషియా సభ్యులను నర్సీపట్నం టౌన్‌లో అనుమానిత ప్రాంతాల్లోను ఉపయోగించుకున్నారు.

విశాఖ ఏజెన్సీలోని జికెవీధి మండలం గునుకురాయిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ కేసులోను, చింతపల్లి మండలంలో కొన్ని చోట్ల జరిగిన దోపిడి ఘటనల్లోను గాంధీకి సంబంధం ఉందనే నేరం కింద చింతపల్లి కోర్టులో హాజరుపర్చడానికి హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి తీసుకువచ్చారు. గునుకురాయి ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులతో పాటు ఒక పోలీసు కానిస్టేబుల్‌ కూడా చనిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X