సర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులపై సర్కార్ కీలక నిర్ణయం-ఉత్తర్వులు..!
ఏపీలో సచివాలయ ఉద్యోగుల (స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు ) విషయంలో కూటమి ప్రభుత్వం (Ap govt) ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. మిగులు ఉద్యోగుల్ని స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ శాఖ నుంచి ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై తీసుకునేందుకు ఇవాళ అనుమతి ఇచ్చింది. దీంతో తగినంత మంది ఉద్యోగులు లేక ఇబ్బందులు పడుతున్న పలు శాఖల్లో కొరత తీరబోతోంది.
రాష్ట్రంలో 'స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు'ల్లో పనిచేస్తున్న మిగులు సిబ్బందిని డిప్యుటేషన్పై ఇతర శాఖలకు కేటాయించేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర శాఖలు, కార్పొరేషన్లు సుమారు 6,124 మంది స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బందిని డిప్యుటేషన్పై తమకు బదిలీ చేయాలని కోరుతున్నాయి. అయితే ప్రస్తుతం సచివాలయాల్లో హేతుబద్ధీకరణ తర్వాత కేవలం 5,374 మంది మిగులు సిబ్బంది మాత్రమే ఉన్నారు.

ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన మెమోలో స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీంతో ఉన్న సిబ్బందిని అయినా ఇచ్చేయాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి దీనిపై సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని డిప్యుటేషన్లపై ఇతర శాఖలకు వెళ్లేందుకు అనుమతించింది. అయితే సొంత శాఖను వదిలి డిప్యుటేషన్లపై ఇతర శాఖలకు వెళ్లేందుకు ఉద్యోగులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వీరంతా ఇతర శాఖలకు తరలి వెళ్లాల్సిందే.














Click it and Unblock the Notifications