భవిష్యత్ భారత్ కోసం అదానీ గ్రూప్ భారీ ప్రణాళిక:ఇంధన రంగంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి

భవిష్యత్తు భారతావనికి అవసరమైన ఇంధన భద్రతను అందించడమే కాకుండా, దేశాన్ని స్వయంసమృద్ధి పథంలో నడిపించేందుకు అదానీ గ్రూప్ ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. ప్రపంచ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, సరఫరా గొలుసులో తలెత్తుతున్న ఆటంకాల దృష్ట్యా భారత ఇంధన సార్వభౌమత్వానికి భరోసా కల్పించే లక్ష్యంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఒక భారీ సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. కేవలం ఒకే గొడుగు కింద సాంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగాలైన సౌర, పవన, జల, అణు విద్యుత్ విభాగాలను ఏకం చేస్తూ సరికొత్త ఇంధన శకానికి శ్రీకారం చుట్టారు.

వార్షిక సాధారణ సమావేశంలో గౌతమ్ అదానీ ప్రసంగిస్తూ, దేశీయంగా నిరంతరాయమైన, అత్యంత సురక్షితమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించేందుకు తమ సరికొత్త వ్యూహాన్ని ఆవిష్కరించారు. రాబోయే ఐదేళ్లలో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల భారీ వ్యయంతో 45 గిగావాట్ల (GW) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇది భారతదేశ ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి రంగ చరిత్రలోనే అత్యంత విప్లవాత్మకమైన, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత కలిగిన అడుగుగా నిలవనుంది.

Adani Group announces massive 2 trillion energy investment plan

భవిష్యత్తు తరాల కోసం అణు, జల విద్యుత్ రంగాలు

ఈ క్లీన్ ఇంధన ప్రణాళికలో భాగంగా పొరుగు దేశాలతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, భూటాన్‌కు చెందిన డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో చేతులు కలిపింది. దీని ద్వారా హిమాలయాల్లో 5,000 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించి భారత గ్రిడ్‌కు పర్యావరణహిత విద్యుత్ జోడించనున్నారు. వీటన్నింటికీ మించి, అదానీ అటామిక్ ఎనర్జీ ద్వారా 2035 నాటికి 10 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవడం ప్రైవేట్ రంగంలో దేశ ఇంధన ప్రస్థానంలోనే ఒక చారిత్రక మైలురాయి.

ఇంధన ప్రసార రంగంలోనూ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తోంది. సరికొత్త సాంకేతికత కలిగిన ఖావ్డా-సౌత్ ఓల్పాడ్ హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (HVDC) లైన్ల ద్వారా సుదీర్ఘ దూరాలకు విద్యుత్ నష్టాలను అరికడుతూ నాణ్యమైన సరఫరాను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ట్రాన్స్‌మిషన్ ఆర్డర్ బుక్ విలువ రూ. 72,000 కోట్లకు చేరడం మౌలిక వసతుల కల్పనలో సంస్థ విశ్వాసానికి, దేశ ఆర్థిక ప్రగతికి ఊతం ఇస్తోదనడంలో ఎటువంటి సందేహం లేదు.

లక్షలాది గృహాలకు పర్యావరణ అనుకూల ఇంధనం

పారిశ్రామిక స్థాయిలోనే కాకుండా సామాన్య మధ్యతరగతి ప్రజల దైనందిన జీవితాల్లోనూ అదానీ గ్రూప్ వెలుగులు నింపుతోంది. అదానీ టోటల్ గ్యాస్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా గృహాలకు పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను అందిస్తూ పర్యావరణహిత ఇంధనాన్ని నేరుగా వంటగదికి చేరుస్తోంది. మైనింగ్ విభాగంలోనూ రికార్డు స్థాయిలో ఏడాదికి 145 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకుని, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ మైనింగ్ నెట్‌వర్క్‌గా అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది.

భారతదేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణతో పాటు, ప్రతి పౌరుడి ఇంటా వెలుగులు నింపాలన్న గురుతర బాధ్యతతో ఈ సమగ్ర ఇంధన ప్రణాళికను రూపొందించారు. ఇది కేవలం ఒక ఉజ్వల వ్యాపార కల కాదు, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని, ఆత్మనిర్భరతను కాపాడే దిశగా పడుతున్న ప్రతి అడుగు. గ్లోబల్ మార్కెట్‌లో భారత్‌ను అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెడుతూ, భవిష్యత్ తరాలకు సురక్షితమైన, స్థిరమైన రేపటిని అందించేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+