వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు వ్యతిరేకం కాదు: ఎఐసిసి ప్రతినిధి

By Santaram
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ: తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ముందుగా భావోద్వేగాలు చల్లారాలన్నారు. తెలంగాణ గురించి విస్తృత ప్రాతిపదికన జాతీయ దృక్పదంతో ఆలోచించాలని ఆయన చెప్పారు. సబ్‌ రీజనల్‌ కోణంలో దీనిని చూడకూడదన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అందరూ సహకరించాలన్నారు. ఉద్రిక్తతను పెంచవద్దని విజ్ఞప్తి చేశారు. కెసిఆర్‌ దీక్ష విరమించాలని కోరారు.

ఇలా ఉండగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం సోమవారం సాయంత్రంలోగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు కూడా సాయంత్రంలోగా ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దీక్ష విరమించకపోవడం వల్ల, తెలంగాణలోని అన్ని వర్గాలు ఆందోళనకు దిగడం వల్ల ఒక ప్రకటన చేస్తే తప్ప చల్లారదనే అభిప్రాయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. రాజకీయంగా కూడా కాంగ్రెసుపై ఒత్తిడి పెరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X