హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దీక్ష విరమించను: రోశయ్యతో కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తెగేసి చెప్పారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కె రోశయ్య ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ తో కలిసి నిమ్స్ లో కెసిఆర్ ను పరామర్శించి దీక్ష విరమించాల్సిందిగా కోరారు. తనకు తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని కెసిఆర్ రోశయ్యతో చెప్పారు. తాను యుపిఎతో మాట్లాడుతున్నానని, దీక్ష విరమించాలని అజిత్ సింగ్ కూడా కెసిఆర్ తో చెప్పారు. అయినా ఆయన వినలేదు.

కెసిఆర్ చేత దీక్ష విరమింపజేయాలని రోశయ్య ఆయన కుటుంబ సభ్యులను కూడా కోరారు. అయితే తాము చెప్పినా వినడం లేదని కుటుంబ సభ్యులు ఆయనతో చెప్పారు. ఫ్రీజోన్ పై అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నామని రోశయ్య చెప్పారు. ఇప్పుడది సమస్య కానే కాదని కెసిఆర్ ఆయనతో అన్నారు. కెసిఆర్ వినకపోవడంతో రోశయ్య వచ్చిన దారినే వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X